సెబీకి డ్రాఫ్ట్ దాఖలు చేసిన టార్సన్స్ ప్రొడక్ట్స్...
ABN , First Publish Date - 2021-08-11T01:28:23+05:30 IST
ఐపీఓ ద్వారా నిధులను సేకరించే క్రమంలో సెబీకి... టార్సన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్... డ్రాఫ్ట్ పేపర్ను దాఖలు చేసింది. ఐపీఓ ఇష్యూ రూ. 150 కోట్ల ఫ్రెష్ ఇష్యూూ కాగా, వాటాదారులు, ప్రమోటర్ల ద్వారా 13.20 మిలియన్ షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది.
ముంబై : ఐపీఓ ద్వారా నిధులను సేకరించే క్రమంలో సెబీకి... టార్సన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్... డ్రాఫ్ట్ పేపర్ను దాఖలు చేసింది. ఐపీఓ ఇష్యూ రూ. 150 కోట్ల ఫ్రెష్ ఇష్యూూ కాగా, వాటాదారులు, ప్రమోటర్ల ద్వారా 13.20 మిలియన్ షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఇక ఆఫర్ ఫర్ సేల్ విషయానికొస్తే 3.90 లక్షల షేర్ల వరకు రోహన్ సెహగల్, 12.50 మిలియన్ షేర్లు, లేదంటే 24.5 శాతం వాటాను క్లియర్ విజన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రయించనుంది. టార్సన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో ప్రస్తుతం సంజీవ్ సెహగల్, రోహన్ సెహల్లకు 29.16 %, 21.81 % చొప్పున వాటాలుండగా, క్లియర్ విజన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 49 శాతం వాటా ఉంది. ఇష్యూకు లీడ్ మేనేజర్స్గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్లు వ్యవహరించనున్నాయి. రూ. 75 కోట్ల విలువైన ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అప్పు చెల్లించడానికి, రూ. 54 కోట్లను పశ్చిమ బెంగాల్లోని పంచల వద్ద కంపెనీకి చెందిన కొత్త తయారీ కేంద్రానికి వినియోగించనుంది.