పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T05:54:48+05:30 IST

నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని స్పీకర్‌ తమ్మి నేని సీతారాం పేర్కొన్నారు.

పనులు పూర్తి చేయాలి
మాట్లాడుతున్న స్పీకర్‌

 స్పీకర్‌ సీతారాం

కలెక్టరేట్‌: నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని స్పీకర్‌ తమ్మి నేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం  ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా అధికారుల తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టే  రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్‌లు, గ్రామ సచివాలయ భవనాలు, మురికి కాలువలు, నీటి సరఫరా వంటి పనులను  త్వరిత గతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, ఈఈ చంద్రశేఖరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T05:54:48+05:30 IST