‘టేస్ట్’ నాన్వెజ్ రెడీ టు ఈట్ ఫుడ్
ABN , First Publish Date - 2021-01-12T09:07:57+05:30 IST
హైదరాబాద్కు చెందిన ‘టేస్ట్’ కంపెనీ దేశంలోనే తొలిసారిగా నాన్-వెజ్ రెడీ టు ఈట్ మీల్స్ను ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన ‘టేస్ట్’ కంపెనీ దేశంలోనే తొలిసారిగా నాన్-వెజ్ రెడీ టు ఈట్ మీల్స్ను ప్రవేశపెట్టింది. గత ఆరు నెలల్లో ప్రయోగాత్మక విక్రయాల్లో నాన్వెజ్ రెడీ టు ఈట్ ఫుడ్ మంచి స్పందన లభించిందని టేస్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజు వనపాల తెలిపారు. చికెన్ కర్రీ రైస్, ఎక్సోటిక్ ప్రాన్ రైస్ను ప్రస్తుత విక్రయిస్తున్నట్లు చెప్పారు. వెజిటేరియన్ విభాగంలో క్లాసిక్ దాల్ రైస్, రవ్వ ఉప్మా వంటి వంటకాలను అందిస్తోంది. హైదరాబాద్లోని పటాన్చెరు వద్ద నెలకు 20 లక్షల మీల్స్ బాక్సులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న ప్లాంట్ కంపెనీకి ఉంది.