‘మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం’
ABN , First Publish Date - 2020-10-25T11:19:55+05:30 IST
నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు అధికంగా పెంచి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని రైల్వేకోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ధ్వజమెత్తారు.
రైల్వేకోడూరు రూరల్, అక్టోబరు24 : నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు అధికంగా పెంచి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోందని రైల్వేకోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ధ్వజమెత్తారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఐదు సార్లు నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు అధికంగా పెంచారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఉల్లిపాయ కన్నీరు పెట్టిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.