లండన్‌లో ఘనంగా TAUK బోనాల జాతర వేడుకలు

ABN , First Publish Date - 2022-07-10T23:51:09+05:30 IST

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా జరిగాయి.

లండన్‌లో ఘనంగా TAUK  బోనాల జాతర వేడుకలు

ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు

"దేశ్ కా నేత కెసిఆర్" అంటూ నినదించిన ఎన్నారైలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 కి  పైగా ప్రవాసీ కుటుంబ సభ్యులు  హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టాక్ ఉపాధ్యక్షురాలు సుషుమ్న రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం అధికార ప్రతినిది హరిగౌడ్ వాఖ్యాతగా కొనసాగింది. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు,  ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.


లండన్‌కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. సందీప్ కుమార్ బుక్క, ఆయన మిత్ర బృందం పర్యవేక్షణలోనే జరిగిన పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.


భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ, యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం గురించి మాట్లాడుతు లండన్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో శ్రమించిన నాయకుడని, తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి ప్రపంచ వేదికల్లో వినూత్నంగా పరిచయం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి ప్రవాసులకు మధ్య వారధిలా ఉంటూ ఎంతో కష్టపడి పని చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనిల్ కష్టాన్ని గుర్తించి TSFDC చైర్మన్‌గా సమున్నత స్థానం కల్పించినందుకు గాను తెలంగాణ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేసారు.


ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన "బోనాలను" ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శమని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న  మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి, బహుమతులందజేశారు.


మరి ఎంపీ రూత్ క్యాడ్బరి మాట్లాడుతూ ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి ఈ వేడుకల గొప్పదనాన్ని తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం చూసి సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశం బ్రిటన్ అని వ్యాఖ్యానించారు.  ప్రజలందరూ కలిసి మెలిసి ఐక్యమత్యంతో మెలగాలని పిలుపునిచ్చారు.


టాక్ సంస్థ అద్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి,  వీటిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాల గురించి, బంగారు తెలంగాణలో ఎన్నారైల పాత్ర గురించి అందరికీ గుర్తు చేశారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి,  బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో.. నేడు  పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్‌కు  కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న MLC కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపక అద్యక్షుడు అనిల్ కూర్మంచలానికి దక్కిన గౌరవం ప్రతి ప్రవాస బిడ్డకి దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. అనిల్ అన్న స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నామని తేలిపారు. సంస్థ ఉపాద్యక్షురాలు సుషుమ్న రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడ బిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు నిర్వహించడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.


ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు-బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ  సందర్బంగా అనిల్ కూర్మచలం గత దశాబ్దకాలంగా తెలంగాణ సంస్కృతిని ఎంత ముందుకు తీసుకువెళ్లారో గుర్తు చేసుకున్నారు. లండన్‌లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియ చేసి వారిని సత్కరించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని, నేడు తెలంగాణాలో జరిగే అభివృద్ధి దేశమంతా అమలు కావాలంటే కేవలం కెసిఆర్ నాయకత్వం వల్లే సాధ్యమవుతుందని,  "దేశ్‌కా నేత కెసిఆర్ " అంటూ ఎన్నారైలంతా ఈ సందర్భంగా నినదించారు. "ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే" ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ కూర్మాచలంతో జరుపుకున్న బోనాల పండుగను గుర్తు చేసుకున్నారు. ప్రతి ప్రవాస బిడ్డ శర్మా జీ స్పూర్తితో ప్రత్యక్ష రాజకీయాలలో క్రియా శీలకంగా పనిచేసి మన సమాజ ఐకమత్యాన్ని చాటి చెప్పాలని కోరారు. 


ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత,  రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని ఈ వేడుకలకు హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ఆదేశ్ ఫర్మాన్‌లను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలను అందజేశారు. టాక్ సభ్యులు సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, పృధ్వీ, శ్రీకాంత్, క్రాంతి, సుప్రజ పులుసు ఆద్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సబ్యులు తెలిపారు. ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరయ్యారు.


 

ఈ కార్యక్రమంలో అద్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు సుషుమ్న రెడ్డి, సత్య చిలుముల, అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి,  సభ్యులు పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృథ్వి, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నికిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. 













Updated Date - 2022-07-10T23:51:09+05:30 IST