చెత్తపై పన్ను చెల్లించరాదని ప్రచారం
ABN , First Publish Date - 2021-10-24T06:36:28+05:30 IST
రాష్ట్రప్రభుత్వం కొత్తగా చెత్తపై విధించిన పన్నును చెల్లించరాదని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముమ్మిడివరంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
ముమ్మిడివరం, అక్టోబరు 23: రాష్ట్రప్రభుత్వం కొత్తగా చెత్తపై విధించిన పన్నును చెల్లించరాదని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముమ్మిడివరంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచి చెత్తపై పన్ను చెల్లించవద్దని సూచించారు. సకిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, జి.దుర్గాప్రసాద్, జంగా కృష్ణమూర్తి, గోడి కృష్ణమూర్తి, శీలం వెంకటేష్, బీర శ్రీనివాస్, జంగా బాలయ్య పాల్గొన్నారు.