పాతబకాయిలపై దృష్టి పెట్టాలి
ABN , First Publish Date - 2020-12-04T05:58:00+05:30 IST
డివిజన్లలో పాతబకాయిలపై మరింతగా దృష్టి పెట్టి వసూళ్లు పెంచాలని వాణిజ్యపన్నులశాఖ అడిషనల్ కమిషనర్ రమేష్ తెలిపారు.
సీటీ శాఖ అడిషనల్ కమిషనర్ రమేష్
గుంటూరు, డిసెంబరు 3: డివిజన్లలో పాతబకాయిలపై మరింతగా దృష్టి పెట్టి వసూళ్లు పెంచాలని వాణిజ్యపన్నులశాఖ అడిషనల్ కమిషనర్ రమేష్ తెలిపారు. నరసరావుపేట డివిజన్ జాయింట్ కమిషనర్ కిరణ్చౌదరితో కలిసి ఆయన గుంటూరు జిన్నాటవర్ సెంటర్లోని వసుంధరభవన్లో సమీక్ష నిర్వహించారు. పాతబకాయిలు, జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాతబకాయిలు రాబట్టేందుకు అవసరమైతే ఆర్ఆర్ యాక్టు ప్రయోగించాలన్నారు. బిల్లుల్లేకుండా అక్రమంగా వెళుతోన్న సరుకు రవాణాపై దృష్టి సారించి మొబైల్ తనిఖీలు పెంచాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు నాగజ్యోతి, మురళీకృష్ణ ఇతర అధికారులున్నారు.