సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారు: టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2020-11-22T17:00:40+05:30 IST
సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారు: టీడీపీ నేతలు
విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతల అరెస్ట్ను టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా ఖండించారు. పోలవరం పరిరక్షణ యాత్రకు సీపీఐ రాష్ట్ర బృందం పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ సీపీఐ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వెంటనే రామకృష్ణ, సీపీఐ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.