విద్యుత్ షాక్తో టీడీపీ నేత మృతి
ABN , First Publish Date - 2021-01-16T06:08:56+05:30 IST
మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆకుల నాగేశ్వరరావు(27) గురువారం విద్యుత్షాక్తో మృతిచెందాడు.
దర్శి, జనవరి 15 : మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆకుల నాగేశ్వరరావు(27) గురువారం విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఆయన మాగాణీలో ట్రాక్టరుతో దమ్ము తిప్పుతున్నాడు. పొలంలో సర్వీస్ తీగలు అడ్డురావడంతో వాటిని చేత్తో పైకినెట్టే ప్రయత్నం చేశాడు. విద్యుత్ తీగలకు లీకు ఉండడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెక్కల కష్టంతో జీవించే కుటుంబ యజమాని ఆకస్మికంగా మృతిచెందటంతో ఆ కుటుంబం పరిస్ధితి దయనీయంగా మారింది. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగేశ్వరరావు మృతదేహానికి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పమిడి రమేష్, టీడీపీ మండల అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్య, మాజీ అధ్యక్షుడు బొట్ట కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మారెళ్ళ వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా లీగల్సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్, తదితరులు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.