27 అంశాలపై శాసనసభలో చర్చకు TDP డిమాండ్
ABN , First Publish Date - 2021-11-18T15:53:54+05:30 IST
ఏపీ అసెంబ్లీలో 27 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో 27 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీఏసీ ముందు ఉంచారు. పెట్రో ధరలు తగ్గింపు, రోడ్ల దుస్థితి, మహా పాదాయాత్రపై చర్చకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు, పీర్సీ, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై చర్చ జరగాలని టీడీపీ ప్రతిపాదనలు చేసింది.