టీడీపీ ఆర్యవైశ్య సంఘం మీటింగ్కు హోటల్లో అనుమతి నిరాకరన
ABN , First Publish Date - 2020-11-22T21:02:39+05:30 IST
టీడీపీ ఆర్యవైశ్య సంఘం మీటింగ్కు హోటల్లో అనుమతి నిరాకరన
విజయవాడ: ఓ హోటల్లో టీడీపీ ఆర్యవైశ్య సంఘం సమావేశమైంది. కాగా, సమావేశాన్ని ప్రారంభించక ముందే హోటల్లో సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆటోనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆర్యవైశ్య ప్రతినిధులు సమావేశం పెట్టుకున్నారు. కరోనా కష్ట కాలంలో అనేక మంది ఆర్యవైశ్యులు ప్రాణాలు విడిచారని, కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి వెల్లంపల్లి అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, వెల్లంపల్లికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన డిమాండ్ చేశారు.