‘ఇల్లాలిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు’
ABN , First Publish Date - 2021-11-20T22:30:45+05:30 IST
ఏపీ అసెంబ్లీ ఘటనను టీ.టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని బి.నర్సింహులు అన్నారు. ఏపీ శాసనసభలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఘటనను టీ.టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని బి.నర్సింహులు అన్నారు. ఏపీ శాసనసభలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. అత్యధిక కాలం సీఎంగా సేవలందించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇంటికి పరిమితమైన ఒక ఇల్లాలిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఏపీ సంపదను జగన్ దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు.