వైఎస్ అలా అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాం: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-05-27T22:55:57+05:30 IST
ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి: ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల ప్రాశస్త్రాన్ని కాపాడుకుందామని చెప్పారు. తాము ఏనాడు అధికార దుర్వినియోగం చేయలేదన్నారు. ఏడుకొండలు ఎందుకని వైఎస్ అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తుచేశారు. ధనదాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచమన్నారు. పింక్ డైమండ్ విషయంలో తమపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.