పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-13T18:58:53+05:30 IST

ట్విట్టర్ వేదికగా వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబు మండిపడ్డారు. తమకేదయినా ఆపద వస్తే ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలన్నారు.

పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించాలి: చంద్రబాబు

అమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబు మండిపడ్డారు. తమకేదయినా ఆపద వస్తే ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలన్నారు. రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెంచేలా ఉన్నాయన్నారు. ఇంత ఖర్చుపెడుతున్నాం, అంత ఖర్చుపెడుతున్నాం అంటూ పాలకులు లెక్కలు చెబుతున్నారు, అలాంటప్పుడు పరిస్థితులు ఎందుకింత దారుణంగా ఉన్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘పేషంట్ల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి?’’ అని ప్రశ్నించారు. అక్షయ లాంటి సంస్థలతో కలిసి అన్న క్యాంటీన్‌లను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించండన్నారు. 



Updated Date - 2020-07-13T18:58:53+05:30 IST