కడప వరద ప్రాంతాల్లో యధావిధిగా చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-11-23T03:43:01+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన మంగళవారం యధావిధిగా కొనసాగనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9:30 కు ప్రత్యేక విమానంలో..
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన మంగళవారం యధావిధిగా కొనసాగనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9:30 కు ప్రత్యేక విమానంలో చంద్రబాబు కడపకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం తర్వాత తిరుపతిలో పర్యటిస్తారు. బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు.