యడ్లపాటి వెంకట్రావుకు చంద్రబాబు పరామర్శ
ABN , First Publish Date - 2021-10-04T00:03:52+05:30 IST
యడ్లపాటి వెంకట్రావుకు చంద్రబాబు పరామర్శ
హైదరాబాద్: రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్లోని వెంకట్రావు స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇటీవల వెంకట్రావు సతీమణి అలివేలు మంగమ్మ మృతి చెందారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.