డీజీపీ వ్యాఖ్యలను ఖండించిన నూకసాని
ABN , First Publish Date - 2021-01-17T05:37:03+05:30 IST
దేవాలయాల ఘటనలపై రాష్ట్ర డీ జీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తెలిపారు.
ఒంగోలు (కార్పొరేషన్) జనవరి 16 : దేవాలయాల ఘటనలపై రాష్ట్ర డీ జీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తెలిపారు. శనివారం ఒంగో లులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆలయాలు, విగ్రహాల ధ్వంసం ఆకతాయిలపనే అంటూ ప్రకటించిన డీజీపీ, ఆయన తిరిగి శుక్రవారం రాజ కీయ పార్టీలకు ముడిపెట్టడం సరికాదన్నారు.పొంతనలేని డీజీపీ ప్రకటన అయోమానికి గురిచేస్తుందన్నారు. తెలుగుదేశంపార్టీ అన్ని మతాలను సమ దృష్టితో చూస్తుందని, దేవాలయాలపై దాడుల కుట్ర కోణాన్ని ఛేదించాలని ఆయన డిమాండ్ చేశారు.