మేమే ప్రజా శాసనసభ నిర్వహిస్తాం: టీడీపీ
ABN , First Publish Date - 2020-12-03T19:53:40+05:30 IST
జగన్మోహన్ రెడ్డి, మంత్రి కన్నబాబుకు తెలుగుదేశం పార్టీ సభా హక్కుల నోటీసులు ఇవ్వనుంది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి కన్నబాబుకు తెలుగుదేశం పార్టీ సభా హక్కుల నోటీసులు ఇవ్వనుంది. పంటల బీమా పథకంపై సభను తప్పుదోవ పట్టించారని నోటీసుల్లో పేర్కొంటూ..స్పీకర్ కార్యాలయంలో ఇవ్వాలని నిర్ణయించింది. శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే.. మేమే ప్రజా శాసనసభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై అక్కడే చర్చిస్తామన్నారు.