దళితుల సంక్షేమానికి టీడీపీ కృషి

ABN , First Publish Date - 2022-01-27T06:03:10+05:30 IST

తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమానికి చే స్తుందని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి దాసరి శ్యామ్‌ చంద్ర శేషు అన్నారు.

దళితుల సంక్షేమానికి టీడీపీ కృషి
దళిత ప్రతిఘటన సభలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

జంగారెడ్డిగూడెం, జనవరి 26: తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమానికి చే స్తుందని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి దాసరి శ్యామ్‌ చంద్ర శేషు అన్నారు. పంగిడి గూడెంలో టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్‌ అధ్యక్షతన బుధవారం దళిత ప్రతిఘటన సభ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న శేషు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, హత్యాయత్నాలు పెరిగాయని, ఉన్న పథకాలను కూడా తీసివేసి దళితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తొందన్నారు. గొల్లమందల శ్రీనివాస్‌ మాట్లాడుతూ త్వరలోనే ఏలూరులో దళిత ప్రతిఘటన సభ పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. పగడం సౌభాగ్యవతి, రావూరి కృష్ణ, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, ఆకుమర్తి రామారావు, ఉండవల్లి రవిశంకర్‌, సాయిల సత్యనారాయణ, గంటా రామారావు ఇంద్రాణి, అనీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:03:10+05:30 IST