ఆ మాటను జగన్ పట్టించుకోలేదు: అమర్నాథ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-07T00:23:55+05:30 IST

టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక జగన్ ఆ మాటను పట్టించుకోలేదని...

ఆ మాటను జగన్ పట్టించుకోలేదు: అమర్నాథ్ రెడ్డి

తిరుపతి: టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక జగన్ ఆ మాటను పట్టించుకోలేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుల నిరసనకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నేతలు పులివర్తి నాని, నరసింహ యాదవ్, గాలి భానుప్రకాష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల నిరసనకు సంఘీభావం తెలిపిన టీటీడీ ఉద్యోగులపై వేటు వేయడం హేయమైన చర్య. ఉద్యోగులను, అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడానికే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా పిచ్చి దుగ్లక్ పాలన మానుకుని ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలి.’’ అని సూచించారు. 

Updated Date - 2021-12-07T00:23:55+05:30 IST