ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: పీతల సుజాత
ABN , First Publish Date - 2021-12-16T01:42:53+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి పీతల సుజాత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు..
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి పీతల సుజాత విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీతల సుజాత కోరారు.
కాగా జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.