టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సంచనల వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-17T19:50:35+05:30 IST

రాజానగరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సంచనల వ్యాఖ్యలు

రాజమండ్రి: రాజానగరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెండున్నర ఏళ్ల పాలనలో భూకజ్జాలు, ఇసుక దోపీడీ, దళితులపై దాడులకు రాజానగరం నియోజకవర్గం వేదికైందన్నారు. సీతానగరంలో గిరిజన లెక్చరర్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై సీతానగరం ఎస్ఐ కాల్‌లిస్టు బయటపెట్టి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజానగరంలో జరిగే అవినీతిని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాడన్న అక్కసుతోనే లెక్చరర్‌పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు. కరోనా సమయంలో రాజానగరం వైసీపీ నాయకులు ట్రస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.15 కోట్లు అక్రమ వసూళ్లు చేశారని ఆరోపించారు. రాజానగరం నియోజకవర్గం వైసీపీ నేతలు అక్రమ వసూళ్లపై సత్యప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. రాజానగరం పేరు చెప్పటానికి సిగ్గుపడే విధంగా వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారని వెంకటేష్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-09-17T19:50:35+05:30 IST