ప్రశ్నార్థకంగా దళితుల జీవనం: జీవీ

ABN , First Publish Date - 2020-08-13T12:59:58+05:30 IST

రాష్ట్రంలో దళితుల జీవనాన్నే ప్రశ్నార్థకం చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై..

ప్రశ్నార్థకంగా దళితుల జీవనం: జీవీ

గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళితుల జీవనాన్నే ప్రశ్నార్థకం చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఓ ప్రకటనలో మండిపడ్డారు. దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్న మంత్రి విశ్వరూప్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 25 రోజులైనా అసలు నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వరప్రసాద్ మనోధైర్యంతో ఉండాలని, న్యాయం జరుగుతుందన్నారు. దళితులపై జరుగుతున్న వరుస దాడులపై అన్ని ప్రజా, కుల సంఘాలు ఒక్కటై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని గద్దెనెక్కిన పాలకులు, దళితులపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు.

Updated Date - 2020-08-13T12:59:58+05:30 IST