అత్యధిక పంచాయతీలు కైవసం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-01-27T06:08:06+05:30 IST
అద్దంకి నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకునేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గొట్టిపాటి
అద్దంకి, జనవరి 26 : అద్దంకి నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకునేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులతో మంగళవారం ఎమ్మెల్యే రవికుమార్ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ప్రస్తుత వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూనే టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం పలు గ్రామాల నాయకులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు.