రైతులకు అండగా నిలిచేది టీడీపీ మాత్రమే
ABN , First Publish Date - 2021-09-17T13:58:27+05:30 IST
ఎప్పటికైనా రైతులకి..
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా
భట్టిప్రోలు: ఎప్పటికైనా రైతులకి అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడమే కాని రైతులకు చేసిందేమి లేదని సాయిబాబా ఎద్దేవా చేశారు. ఈ నెల 18న వేమూరులో జరిగే రైతుల కోసం తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొంటారని రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సాయిబాబా కోరారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధి కార ప్రతినిధి దీపాల శివప్రసాద్, నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, సయ్యద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.