దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2021-10-22T05:55:22+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకుడు రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

టీడీపీ నాయకుడు రాధాకృష్ణ 

మడకశిరటౌన, అక్టోబరు 21: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకుడు రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంతోపాటు నాయకుల ఇళ్లపై వైసీపీ నేతల దాడికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా మడకశిరలో నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. గురువారం బాలాజీ నగర్‌లోని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి స్వగృహం ఆవరణలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేసినఘటనలు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోజు రోజుకూ వ్యక్తిగత కక్షలు పెరగడంతోపాటు ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యువత అధ్యక్షులు తిమ్మరాజు, నాగరాజు, పట్టణ అధ్యక్షులు మనోహర్‌, కౌన్సిలర్లు ఉమాశంకర్‌, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, హనుమంతరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:55:22+05:30 IST