అడ్డుకోవాల్సిన జగన్‌ చిరునవ్వులు చిందించడం దారుణం

ABN , First Publish Date - 2021-11-26T09:24:28+05:30 IST

అడ్డుకోవాల్సిన జగన్‌ చిరునవ్వులు చిందించడం దారుణం

అడ్డుకోవాల్సిన జగన్‌ చిరునవ్వులు చిందించడం దారుణం

తమ్మినేని కళ్లు నెత్తికెక్కాయి: బండారు

విశాఖపట్నం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయ సమాజంలో మహిళలను గౌరవించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అటువంటిది తల్లి వంటి భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడుతుంటే వారించాల్సిన సీఎం జగన్మోహన్‌రెడ్డి చిరునవ్వుతో చూడడం దారుణం’’ అని తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతల తీరును నిరసిస్తూ గురువారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గల గాంధీవిగ్రహం వద్ద టీడీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. బండారు మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్‌ దయతో రాజకీయాల్లో కీలక పదవులు అనుభవించిన తమ్మినేని కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... అసెంబ్లీలో మహిళను అగౌరపరిచిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అదనపు భద్రత కల్పించడం సిగ్గుచేటన్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సీఎంతోపాటు వైసీపీ నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-26T09:24:28+05:30 IST