‘వరి పంట వద్దు... గంజాయి పంట వేయిస్తారా?’
ABN , First Publish Date - 2021-12-07T21:35:22+05:30 IST
ఏపీలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. జగన్రెడ్డి విధానాల వల్ల వ్యవసాయరంగం కుదేలయ్యిందన్నారు.
అమరావతి: ఏపీలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. జగన్రెడ్డి విధానాల వల్ల వ్యవసాయరంగం కుదేలయ్యిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని ఆయన విమర్శించారు. ఏపీలో వరి పంట వేయొద్దంటున్న మంత్రి కన్నబాబు రైతులతో గంజాయి పంట వేయిస్తారా? అని ప్రశ్నించారు. రైతు ప్రయోజనాల కోసం కేంద్రంతో జగన్ పోరాడాలన్నారు.