కొవిడ్‌ నియమాలు వైసీపీ నేతకు వర్తించవా?

ABN , First Publish Date - 2021-03-02T05:34:53+05:30 IST

నేషనల్‌ పర్మిట్‌ లారీలా తిరుగుతున్న ఎంపీ విజయసాయిరెడ్డికి కొవిడ్‌ నిబంధనలు వర్తించవా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు.

కొవిడ్‌ నియమాలు వైసీపీ నేతకు వర్తించవా?

గుంటూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ పర్మిట్‌ లారీలా తిరుగుతున్న ఎంపీ విజయసాయిరెడ్డికి కొవిడ్‌ నిబంధనలు వర్తించవా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. పశ్చిమ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రానికి హోం మంత్రి సుచరితా లేక సజ్జల రామకృష్ణారెడ్డో అర్థం కాని పరిస్థితిలో ప్రజలున్నారన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన పెద్దిరెడ్డి ఎన్నిమిది సార్లు గెలిచిన చంద్రబాబుని ఓడిస్తానని బీరాలు పలకటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంటే వైసీపీ నేతలకు గుండెల్లో రైలు పరుగెత్తుతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే రేణిగుంట విమానాశ్రయంలో ఆయన్ని నిలిపేశారన్నారు. జగన్మోహనరెడ్డి చర్యలు హిట్లర్‌ పాలనను తలిపిస్తున్నాయని విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందని.. కొందరు వైసీపీ నేతలకు తొత్తులుగా మారారని ఆరోపించారు.  


Updated Date - 2021-03-02T05:34:53+05:30 IST