వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ కీలక నేత..

ABN , First Publish Date - 2021-08-28T18:06:35+05:30 IST

పద్మావతిపురం నుంచి ర్యాలీగా తరలివచ్చి

వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ కీలక నేత..

  • సముచిత స్థానం కల్పిస్తామన్న ఎమ్మెల్యే భూమన


తిరుపతి : టీడీపీ కీలక నేత, నగర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మార్కెట్‌ దొరైరాజ్‌ తన అనుచరులతో కలసి శుక్రవారం వైసీపీలో చేరారు. పద్మావతిపురం నుంచి ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే భూమన నివాసంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. దొరైరాజ్‌ కుటుంబానికి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 1991నుంచి 2002వరకు దొరైరాజ్‌ తన అనుచరుడిగానే ఉన్నారని, అనంతరం పలు కారణాల రీత్యా టీడీపీలోకి వెళ్లారన్నారు. ఆయనతో పాటు పరసాల వీధి ఆనంద్‌, శ్రీధర్‌రాయల్‌, ప్రసాద్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ కార్పొరేటర్‌ ఎస్‌కే బాబు, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ వెంకటేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-08-28T18:06:35+05:30 IST