ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవల్ని వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-29T05:35:18+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత మెడిసిన్‌, నిష్ణాతులైన డాక్టర్‌లచే సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు పశ్చిమ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర తెలిపారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవల్ని వినియోగించుకోవాలి
డేగల ప్రభాకర్‌ను అభినందిస్తున్న కోవెలమూడి రవీంద్ర తదితరులు

గుంటూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత మెడిసిన్‌, నిష్ణాతులైన డాక్టర్‌లచే సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు పశ్చిమ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో పోస్టర్‌ను విడుదల చేశారు. కొవిడ్‌ టెలిమెడిసిన్‌ సాయం కావాలనుకున్నవారు 8801033323కి మిస్ట్‌కాల్‌ ఇస్తే చాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ట్రస్ట్‌ నిర్వాహకురాలు నారా భువనేశ్వరికి ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. కాగా టీడీపీ  గుంటూరు నగర అధ్యక్షుడిగా ఎన్నికైన డేగల ప్రభాకర్‌ శుక్రవారం కోవెలమూడి రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పార్టీ మరింత బలోపేతం అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 


Updated Date - 2022-01-29T05:35:18+05:30 IST