చంద్రబాబు, లోకేశ్ త్వరగా కొలుకోవాలి
ABN , First Publish Date - 2022-01-25T04:35:07+05:30 IST
కరోనా భారిన పడిన చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు.
నెల్లూరు నుంచి గొలగముడికి పాదయాత్ర
నెల్లూరు(వెంకటేశ్వరపురం), జనవరి 24: కరోనా భారిన పడిన చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. టీడీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసుల నాయకత్వంలో గొలముడి వరకు చేపట్టిన పాదయాత్రను సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలనలో ప్రజాస్వామ్యం అంతరించి పోయిందన్నారు. కప్పిర శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్లు వెంటనే కోలుకోవాలని ఆ భవంతున్ని వేడుకొనేందుకు పాదయాత్ర చేపట్టామాన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, ధర్మవరపు సుబ్బారావు, రేవతి, సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.