పరీక్షల రద్దు హర్షణీయం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-06-25T15:17:24+05:30 IST

రాష్ట్రంలో పరీక్షల రద్దు హర్షణీయమని... ఇది విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు.

పరీక్షల రద్దు హర్షణీయం: అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలో పరీక్షల రద్దు హర్షణీయమని... ఇది విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. కోర్టు ముట్టికాయలు వేస్తే గాని కన్ఫూజన్ ముఖ్యమంత్రికి క్లారిటీ వచ్చిందా అని యెద్దేవా చేశారు. విద్యార్థులు, యువత తలుచుకుంటే దేనినైనా సాధిస్తారని మరో సారి నిరూపణ అయ్యిందని తెలిపారు. నారా లోకేష్ పరీక్షల రద్దు కోసం రెండు నెలల నుంచి  విద్యార్థుల కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. దేశ ప్రధాని విద్యార్థులు, తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరీక్షలు రద్దు చేస్తే జగన్ రెడ్డికి వారితో చర్చించే సమయం లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-25T15:17:24+05:30 IST