ఇకపై మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే....: Achennaidu

ABN , First Publish Date - 2022-01-13T17:26:53+05:30 IST

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.

ఇకపై మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే....: Achennaidu

అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి,  పల్నాడులో ‎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  హత్యా రాజకీయాల్ని పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారని తెలిపారు. ఇక వైసీపీ వైసీపీ అరాచకాల్ని సహించమని... ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. చంద్రయ్య కుటుంబానికి 60 లక్షల టీడీపీ కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారన్నారు. చంద్రయ్యను హత్య చేసిన వారిని, హత్య చేయించిన వారిని ‎పోలీసులు కఠినంగా శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-13T17:26:53+05:30 IST