31న ‘‘నారీ సంకల్ప దీక్ష’’: టీడీపీ నేత అనిత

ABN , First Publish Date - 2022-01-27T00:55:34+05:30 IST

ఈనెల 31న విజయవాడలో ‘‘నారీ సంకల్ప దీక్ష’’ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత

31న  ‘‘నారీ సంకల్ప దీక్ష’’: టీడీపీ నేత అనిత

అమరావతి: ఈనెల 31న విజయవాడలో ‘‘నారీ సంకల్ప దీక్ష’’ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత వంగలపూడి అనిత తెలిపారు. దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇంకా ఇవ్వలేదన్నారు. దీంతో శుక్రవారం తలపెట్టిన దీక్షను సోమవారానికి వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. మద్యపాన నిషేధంపై ప్రభుత్వం మాట తప్పిందన్నారు. డ్వాక్రా సంఘాల నిర్వీర్యం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను నిరసిస్తూ తెలుగు మహిళా ఆధ్వర్యంలో ఈ దీక్ష చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-27T00:55:34+05:30 IST