మద్యపానం నియంత్రణపై శ్వేతపత్రం విడుదల చేయాలి: Anitha

ABN , First Publish Date - 2021-12-19T18:55:34+05:30 IST

మద్యపానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

మద్యపానం నియంత్రణపై శ్వేతపత్రం విడుదల చేయాలి: Anitha

విశాఖపట్నం: మద్యపానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం మత్తులో జరిగే మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్న చీప్ లిక్కర్ రెండేళ్లు తాగితే ప్రాణాలు పోతున్నాయన్నారు. మూడు దశల్లో మద్యపాన నియంత్రణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు మడమ తిప్పారని ప్రశ్నించారు. ఆడవాళ్ళ తాళిబొట్లు తెగిపోతున్నా ప్రభుత్వంకు పట్టడం లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలతో పోల్చుకుంటున్న ప్రభుత్వం... అభివృద్ధి విషయంలో ఆ పోటీ ఏమైందని నిలదీశారు. ఐ.ఏ.ఎస్. అధికారులు మద్యం అమ్మకాలు పెంచడంపై రివ్యూ చేయడం దురదృష్టకరమని అన్నారు. వైన్ షాపుల దగ్గర ఆన్ లైన్ పేమెంట్ విధానం అమలులోకి రావడం లేదని... గల్లా పెట్టెలు నింపు కోవడానికే వైన్ షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ పెట్టడం లేదని వ్యాఖ్యానించాు. వైసీపీ నాయకులు, వాలేంటీర్లు గంజాయి,నాటుసారా అమ్మకాలు చేస్తున్నారని అనిత ఆరోపించారు. 

Updated Date - 2021-12-19T18:55:34+05:30 IST