అవ్వాతాతలను జగన్రెడ్డి నిండా ముంచారు: అయ్యన్న
ABN , First Publish Date - 2022-01-02T03:00:41+05:30 IST
నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్రెడ్డి నిండా ముంచారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వం ఇస్తున్న ...
నర్సీనట్నం: నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్రెడ్డి నిండా ముంచారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.2,250 పెన్షన్ను రూ. 2,500కు పెంచుతూ సీఎం జగన్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పెన్షన్ను రూ.3 వేలకి పెంచుతామని హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక పెంచింది రూ.250 మాత్రమేనన్నారు. జగన్రెడ్డి నిరుపేదల్ని దోచుకుంటున్నారని ఘాటుగా ఆరోపించారు. ఈ ఏడాదిలోనైనా సీఎం జగన్రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు