ఉత్తరాంధ్ర మంత్రులు సిగ్గు పడాలి

ABN , First Publish Date - 2021-08-31T03:12:00+05:30 IST

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయనందుకు మంత్రులు సిగ్గు పడాలని మాజీ మంత్రి బండారు

ఉత్తరాంధ్ర మంత్రులు సిగ్గు పడాలి

విశాఖ: ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయనందుకు మంత్రులు సిగ్గు పడాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. గత టీడీపీ హయాంలో తాము ఐదేళ్లలో ఏం చేశామో చెప్తామని,  మీ రెండున్నర ఏళ్లలో ఏం చేస్తారో చెప్పండి చూద్దామని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా వైసీపీ నేతలతో సిద్ధమని ఆయన ప్రకటించారు. మీరు (టీడీపీ) చెయ్యలేని ప్రాజెక్టులను తాము(వైసీపీ) చేశామని చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. రాజధాని కావాలంటే మీకు దమ్ముంటే అన్ని సంస్థల ఒక చోటకి తీసుకురండన్నారు. ఉత్తరాంధ్ర మంత్రులకు సిగ్గుండాలని, కడపకు ఎంత పెట్టారో ఉత్తరాంధ్రకు ఎంత పెట్టారు చూడండని ఆయన హితవు పలికారు. 


Updated Date - 2021-08-31T03:12:00+05:30 IST