వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయి: Bonda
ABN , First Publish Date - 2021-10-05T16:19:25+05:30 IST
వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచి 11 వేల కోట్లు భారం మోపిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు దేవినేని ఉమా అన్నారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచి 11 వేల కోట్లు భారం మోపిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు దేవినేని ఉమా అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసీపీ కరెంటు ఛార్జీలు పెంచమని మ్యానిఫెస్టోలో పెట్టిందని, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కరెంటు బిల్లులు పెరిగాయి అని పేదలకు ఇచ్చే పధకాలను వైసీపీ రద్దు చేసిందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు.