వైసీపీ మ్యానిఫెస్టో పెట్టిన ప్రతి పధకం ఒక బోగస్: Bonda uma
ABN , First Publish Date - 2021-10-07T15:08:21+05:30 IST
డ్వాక్రా మహిళలను మోసం చేసిన వైసీపీ పాదయాత్రలో ప్రతి గ్రూపుకు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు.
అమరావతి: డ్వాక్రా మహిళలను మోసం చేసిన వైసీపీ పాదయాత్రలో ప్రతి గ్రూపుకు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. గెలిచిన తరువాత 2019 నాటికి ఎంత బాకీ ఉంటే అంత రద్దు చేస్తామని మహిళలను వైసీపీ మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు గెలిచి ఉంటే ప్రతి గ్రూపుకు 5 లక్షలు వచ్చేవన్నారు. టీడీపీ హయాంలో మహిళలకు రెండు సార్లుగా రెండు లక్షల రపాయలు ఇచ్చామని గుర్తుచేశారు. వైసీపీ మ్యానిఫెస్టో పెట్టిన ప్రతి పధకం ఒక బోగస్ అని.. నూటికి 20 మందికి కూడా ఏ ఒక్క పధకము రాలేదన్నారు. నవరత్నాలు నవమోసాలుగా మారాయని వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ అని ప్రజల నెత్తన భారాలు మోపారని బోండా ఉమా మండిపడ్డారు.