టీడీపీ నేత బోండా ఉమాపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-10-26T16:50:35+05:30 IST
టీడీపీ నేత బొండా ఉమాపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంటూరు: టీడీపీ నేత బొండా ఉమాపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బొండా ఉమాపై 153 ఎ, 294 బి, 504, 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.