2024లో టీడీపీదే అధికారం: Budda venkanna
ABN , First Publish Date - 2021-10-22T19:41:43+05:30 IST
ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.
అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే జగన్ రాక్షస రాజ్యంగా మార్చారని విమర్శించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అదోగతిపాలైందన్నారు. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్ తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడమని అన్నారు. 2024లో టీడీపీదే అధికారమని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.