Chandrababu: మచిలీపట్నం చేరుకున్న టీడీపీ అధినేత

ABN , First Publish Date - 2021-07-14T18:25:46+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు బుధవారం మచిలీపట్నం చేరుకున్నారు.

Chandrababu: మచిలీపట్నం చేరుకున్న టీడీపీ అధినేత

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు బుధవారం  మచిలీపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు చిత్ర పటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళర్పించారు. నరసింహారావుతో పాటు ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ నేతలకు అధినేత నివాళులు అర్పించారు.  కొల్లు రవీంద్ర మామ, మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలోనే కొల్లు రవీంద్రను, కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. 

Updated Date - 2021-07-14T18:25:46+05:30 IST