ఎన్నికలయ్యే వరకు ఇక్కడే ఉంటా: టీడీపీ అధినేత
ABN , First Publish Date - 2021-11-04T19:47:56+05:30 IST
టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి రోజు కనబరిచిన ఆవేశం స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని
అమరావతి: టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి రోజు కనబరిచిన ఆవేశాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఎన్నికలయ్యే వరకూ నేను ఇక్కడ ఉంటా... అవసరమైతే నేనే ఎన్నికల కమిషనర్ వద్దకు, క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడతా’’ అని తెలిపారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికలని టీడీపీ శ్రేణులు గుర్తించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.