కొల్లు రవీంద్రను ప్రభుత్వం వేధిస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-12-04T17:18:55+05:30 IST

మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కొల్లు రవీంద్రను ప్రభుత్వం వేధిస్తోంది: చంద్రబాబు

అమరావతి: మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణల పేరుతో టీడీపీ కొల్లు రవీంద్రను ప్రభుత్వ వేధిస్తోందని అన్నారు. ఆవేదనతోనే మంత్రి పేర్నినానిపై భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్వరరావు దాడి చేశాడని... ఘటనను  టీడీపీ తీవ్రంగా ఖండించిందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ వారే చేయించారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేర్ని నానిపై దాడికి, టీడీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీ నాయకులకే ముడిపెడతారా అని బాబు నిలదీశారు. బీసీలపై ఇంత కక్ష సాధింపులు ఎందుకని... దాడికి పాల్పడిన వ్యక్తిని విచారిస్తే ఎవరు అడ్డుకుంటారని మండిపడ్డారు. గతంలో కుటుంబ కలహాలతో జరిగిన హత్యలో కొల్లు రవీంద్రను అరెస్టు చేశారన్నారు.  అక్రమ కేసులు పెట్టి అణగదొక్కాలనుకోవడం సరికాదని తెలిపారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.


Updated Date - 2020-12-04T17:18:55+05:30 IST