టీడీపీ నాయకుడు మృతి

ABN , First Publish Date - 2020-12-04T05:09:55+05:30 IST

మండ లంలోని జంగాలపల్లి గ్రామానికి చెం దిన తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కసిరెడ్డి కొండారెడ్డి (ఎర్ర కొండారెడ్డి) (72) గురువా రం మృతి చెందారు.

టీడీపీ నాయకుడు మృతి
కసిరెడ్డి కొండారెడ్డి (ఎర్ర కొండారెడ్డి)

పీసీపల్లి, డిసెంబరు 3 : మండ లంలోని జంగాలపల్లి గ్రామానికి చెం దిన తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కసిరెడ్డి కొండారెడ్డి (ఎర్ర కొండారెడ్డి) (72) గురువా రం మృతి చెందారు. కొద్ది రోజు లుగా నరాల వ్యాధితో బాధపడుతు న్నారు. గురువారం ఆరో గ్యం క్షీణిం చడంతో  అపస్మారక స్థితిలోకి  వెళ్లారు. కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించే సమయంలోనే కొండారెడ్డి మృతి చెందారు. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు న్నారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు  జరిగే క్రమంలో ఆయ న మురిగమ్మి నుంచి టీడీపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చే శారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న కొండారెడ్డి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు గుర్తు చేశారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఫోన్‌లో కొం డారెడ్డి కుటుంబ సభ్యు లను పరామర్శించి సానుభూతి తెలిపారు. 


Updated Date - 2020-12-04T05:09:55+05:30 IST