ప్రపంచమంతా క్రిస్మస్ వెలుగులు ప్రసరిస్తుంటే ఏపీలో మాత్రం...: Devathoti
ABN , First Publish Date - 2021-12-24T15:31:13+05:30 IST
ప్రపంచమంతటా క్రిస్మస్ వెలుగులు ప్రసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ కాలం
అమరావతి: ప్రపంచమంతటా క్రిస్మస్ వెలుగులు ప్రసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ కాలం చీకటి అలుముకొని ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా దళితులే ప్రభుత్వాన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రశ్నించాలన్నారు. దళితులు మౌనంగా ఉన్నంత కాలం సాటి దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని దేవతోటి నాగరాజు అన్నారు.