రుయా ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: దేవినేని
ABN , First Publish Date - 2021-05-11T17:34:29+05:30 IST
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ముందుచూపు, ప్రణాళిక లేకపోటం నిర్లక్ష్యం వల్ల తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలు. సమగ్ర విచారణ జరిపాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోవడం ముమ్మాటకీ సర్కారీ హత్యలే. ప్రశ్నిస్తే కేసులు పెడతామని మీడియా, నాయకులను బెదిరిస్తున్న వారు ఈ సంఘటనకు బాధ్యత తీసుకుంటారా ? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.