ఆ డబ్బును ఎలా ఖర్చు పెడతారు?: దేవినేని
ABN , First Publish Date - 2020-07-02T14:55:36+05:30 IST
ఆ డబ్బును ఎలా ఖర్చు పెడతారు?: దేవినేని
అమరావతి: వైసీపీ పార్టీ బలోపేతం కోసం కొత్తగా ఫీల్డ్ ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసి...దానికి పీకే టీమ్ కోర్ సభ్యుడి సారథ్యం అప్పగిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మీ పార్టీ బలోపేతానికి పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా ఎం.ఎల్.ఓ లను ఎలా నియమిస్తారు? రెవెన్యూ,పంచాయతీ, మున్సిపుల్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మీ పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకొని ఏడాదికి 5వేలకోట్లు ప్రభుత్వ డబ్బును ఎలా ఖర్చుపెడతారు? ఒక్కఛాన్స్ ముఖ్యమంత్రి జగన్ గారు’’ అని దేవినేని ట్వీట్ చేశారు.