ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం లేదు.. కనబడడం లేదు: Devineni

ABN , First Publish Date - 2021-09-15T19:45:42+05:30 IST

రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈనెల 18న నందిగామలో జరుగనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం లేదు.. కనబడడం లేదు: Devineni

అమరావతి: రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈనెల 18న నందిగామలో జరుగనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఇరిగేషన్ శాఖ 28 నెలలో ఏం ఖర్చు పెట్టారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం లేదు, కనబడడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ గురించి ఏమి తెలుసు అని కన్నబాబు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పేదవాడి ఇచ్చే బియ్యంలో కోట్ల రూపాయిలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ లిక్కర్  తాగిన వారు చనిపోతున్నారని  అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. నాసిరకం మద్యం అమ్ముతున్నారన్నారు. ఇసుకను హైదరాబాద్, బెంగళూరుకు, లారీల ద్వారా అధికార పార్టీకి చెందిన వారు లక్షల్లో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. క్యాష్ అండ్ క్యారీ రూపంలో ఇసుక దోపిడీ జరుగుతోందని దేవినేని ఉమా అన్నారు. 

Updated Date - 2021-09-15T19:45:42+05:30 IST